ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సు-కారు ఢీకొని నలుగురు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 01:37 PM

పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు, పంజాబ్ రోడ్‌వేస్ బస్సు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు అమృత్‌సర్ వైపు వెళ్తుండగా, బస్సు హోషియార్‌పూర్ నుండి బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘనపై కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa