ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరల్ అవుతున్న మసూద్ అజహర్‌ ఆడియో రికార్డింగ్

international |  Suryaa Desk  | Published : Mon, Jan 12, 2026, 01:37 PM

నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజహర్‌దిగా చెబుతున్న ఓ కొత్త ఆడియో రికార్డింగ్ ఆదివారం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. భారత్‌పై దాడులకు వేలాది మంది ఆత్మాహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నారంటూ అందులో చేసిన హెచ్చరికలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఆడియో క్లిప్‌లో, వెయ్యి మందికి పైగా ఆత్మాహుతి బాంబర్లు ఏ క్షణంలోనైనా భారత్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగేందుకు సిద్ధంగా ఉన్నారని అజహర్ చెప్పినట్టుగా ఉంది. "వీళ్లు ఒకరు, ఇద్దరు, వంద కాదు.. వెయ్యి మంది కూడా కాదు. అసలు సంఖ్య చెబితే ప్రపంచ మీడియాలో రేపు పెను సంచలనం అవుతుంది" అని అందులో హెచ్చరించాడు. తమ యోధులు ప్రాపంచిక సుఖాల కోసం కాకుండా 'షహాదత్' (అమరత్వం) కోసం సిద్ధంగా ఉన్నారని కూడా ఆ వాయిస్ పేర్కొంది.అయితే, ఈ ఆడియో రికార్డింగ్ ఎప్పటిది, దీని ప్రామాణికత ఎంతవరకు నిజమనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిని స్వతంత్రంగా ధృవీకరించాల్సి ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa