మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేపై తమిళనాడు బీజేపీ నేత అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. ముంబయికి వస్తే తనను అడ్డుకుంటామని రాజ్ ఠాక్రే విసిరిన సవాల్పై అన్నామలై స్పందించారు. తాను ముంబయిలో అడుగుపెడితే కాళ్లు నరికేస్తామని కొందరు బెదిరింపులకు దిగుతున్నారని, ఇలాంటి వాటికి భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. అన్నామలైను ‘రసమలై’ అని ఎగతాళి చేసిన రాజ్ఠాక్రే.. ముంబయి గురించి మాట్లాడే అర్హత అతడికి లేదంటూ వార్నింగ్ ఇచ్చిన మర్నాడే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
దీనిపై తమిళనాడు మాజీ ఐపీఎస్ ఆర్ అన్నామలై మాట్లాడుతూ.. తనకు బెదిరింపులు వస్తున్నాయని, తన కాళ్లు నరికేస్తామని కూడా వార్నింగ్లు ఇస్తున్నామని తెలిపారు. ‘ఆదిత్య ఠాక్రే, రాజ్ ఠాక్రే ఎవరు నన్ను బెదిరించడానికి? నేను రైతు బిడ్డను అని గర్వపడుతున్నాను. నన్ను తిట్టడానికే వాళ్లు సమావేశాలు పెడుతున్నారు. నేను అంత ముఖ్యమైన వ్యక్తిని అయ్యానా నాకు తెలియదు’ అని ఆయన అన్నారు. ‘నేను ముంబయికి వస్తాను.. నా కాళ్లు ఎలా నరుకుతారో చూస్తా..డి. అలాంటి బెదిరింపులకు భయపడితే నా ఊరిలోనే ఉండిపోయేవాడిని.. కామరాజ్ భారత గొప్ప నాయకులలో ఒకరని నేను చెబితే, ఆయన ఇక తమిళుడు కాకుండా పోతాడా? ముంబయి ప్రపంచ స్థాయి నగరం అని నేను అంటే మహారాష్ట్రులు దాన్ని నిర్మించలేదా? వీళ్లంతా అజ్ఞానులు’ అని తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ విమర్శించారు.
ముంబయి ‘అంతర్జాతీయ నగరం’ అన్న అన్నామలై వ్యాఖ్యలపై రాజ్ ఠాక్రే ఆదివారం తీవ్రంగా స్పందించారు తన బాబాయి బాల ఠాక్రే 1960-70ల నాటి నినాదాన్ని గుర్తు చేస్తూ.. ‘ఒక రసమలై తమిళనాడు నుంచి వచ్చింది... ఈ నగరంతో నీకేంటి సంబంధం? హటావో లుంగీ, బజావో పుంగీ’ అని అన్నారు. అంతేకాకుండా మహారాష్ట్రలో హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తే బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వారిని తరిమికొడతామని రాజ్ ఠాక్రే హెచ్చరించారు. ‘యూపీ, బీహార్ వాళ్లు హిందీ మా భాష కాదని అర్థం చేసుకోవాలి. నాకు భాష అంటే ద్వేషం లేదు... కానీ మీరు దాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తే, నేను మిమ్మల్ని తరిమికొడతాను. వాళ్లు అన్ని వైపుల నుంచి మహారాష్ట్రకు వచ్చి మన వాటాను లాగేసుకుంటున్నారు. భూమి, భాష పోతే మనం అంతరించిపోతాం’ అని రాజ్ ఠాక్రే అన్నారు.
శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ముంబయికి ‘ప్రమాదం"’ఉందని, ‘నకిలీ హిందుత్వ’ను బీజేపీ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తమ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, మరాఠీ ప్రజలు, హిందువులు, మహారాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఏకమయ్యాయని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ముంబయి ప్రమాదంలో ఉందని, బీఎంసీ ఎన్నికలు ‘మరాఠాలకు చివరి ఎన్నిక’ అని రాజ్ ఠాక్రే అన్నారు. ఈ అవకాశాన్ని ఈరోజు మీరు కోల్పోతే, మీరు అంతరించిపోతారు. మరాఠీ, మహారాష్ట్ర కోసం ఏకం కండి’" అని ఆయన పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి.పుణె, ముంబి, పింప్రి-చించ్వాడ్ సహా 15 మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి15న పోలింగ్ నిర్వహించి, 16న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa