బెంగళూరులో వారం క్రితం కలకలం రేపిన 34 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. తొలుత విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు అంటుకుని.. పొగతో ఊపిరాడక ఆమె చనిపోయిందని అందరూ భావించారు. కానీ పోలీసుల లోతైన దర్యాప్తులో ఆమెను ఓ 18 ఏళ్ల యువకుడు అతి కిరాతకంగా హత్య చేసినట్లు తేలింది. అది కూడా ఆమె పక్కింటి వ్యక్తే అని తేల్చడంతో.. అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
మంగళూరుకు చెందిన బాధితురాలు బెంగళూరులోని రామమూర్తినగర పోలీస్ స్టేషన్ పరిధిలో తన స్నేహితుడితో కలిసి ఒక గదిలో నివసిస్తోంది. జనవరి 3వ తేదీన సెలవు దినం కావడంతో ఆమె స్నేహితుడు ఊరికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన.. 18 ఏళ్ల పక్కింటి యువకుడు కర్నాల్ కురై లోపలికి ప్రవేశించాడు. రాత్రి 9 గంటల సమయంలో కిటికీ ద్వారా ఆమె గదిలోకి చొరబడి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదీ చూడండి: క్రికెటర్ కాదు క్రిమినల్.. వికలాంగురాలిని ప్రేమించి, పెళ్లాడతానని మాటిచ్చి.. చిత్తూరు జిల్లాలో దారుణం
అయితే బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో భయపడిన నిందితుడు.. ఆమె గొంతును, ముఖాన్ని బలంగా అదిమిపట్టాడు. ఈ పెనుగులాటలో ఆమె స్పృహ కోల్పోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నిందితుడు కేవలం హత్య చేయడమే కాకుండా.. సాక్ష్యాలను మాయం చేసేందుకు ఘటనా స్థలంలో ఆమె దుస్తులను, ఇతర వస్తువులను కాల్చివేసి మంటలు సృష్టించాడు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
ప్రమాదం జరిగిన రోజు గదిలో మంటలు రావడం, లోపల ఆమె శవమై కనిపించడంతో స్థానికులు షాక్ తిన్నారు. పోలీసులు తొలుత దీనిని అసహజ మరణంగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె శరీరపై గాయాలు ఉండటం, నిందితుడు దొంగిలించిన ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో వారం రోజుల వ్యవధిలోనే ఈ కేసు కొలిక్కి రావడం పట్ల బాధిత తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ తమ కుమార్తె ప్రాణాలు తీసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa