డిజిటల్ ఆస్తుల మార్కెట్లో చట్ట విరుద్ధ చర్యలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారతదేశ ఆర్థిక నిఘా విభాగం క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీల కోసం కఠినమైన కొత్త యాంటీ మనీ లాండరింగ్, నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రోటోకాల్లను తీసుకొచ్చింది. వీటిలో ఆన్ బోర్డింగ్ ప్రక్రియ టైం లోనే తప్పనిసరి లైవ్నెస్ డిటెక్షన్ (లైవ్ సెల్ఫీలు), జియో ట్యాగింగ్ వంటివి తీసుకొచ్చింది. ఈనెల 8వ తేదీనే కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అక్రమ నగదు బదిలీ కోసం క్రిప్టో కరెన్సీని ఉపయోగిస్తున్నారని, దానిని కట్టడి చేయాలనే లక్ష్యంతోనే ఈ మేరకు నిబంధనలు కఠినతరం చేసినట్లు తెలుస్తోంది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీలను వర్చువల్ డిజిటల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్లుగా వర్గీకరణ చేశారు. ఇప్పుడు ఈ వీడీఏలు సాధారణ డాక్యుమెంట్ అప్లోడ్లను అనుమతించడం సహా మరిన్ని అదనపు పత్రాలు తీసుకోవడం, పనులు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ ఉనికిని ధ్రువీకరించే లైఫ్ సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా కళ్లు రెప్ప వేయడం లేదా తల కదలిక ద్వారా స్టాటిక్ ఫోటోలు లేదా డీప్ ఫేక్ వీడీయోల వినియోగాన్ని ఇది నిరోధించడంలో సాయపడుతుందని కేంద్రం చెబుతోంది.
క్రిప్టో కరెన్సీ ట్రేడర్లు తమ ఖాతాను తెరిచే ప్రక్రియను ప్రారంభించిన కచ్చితమైన అక్షాంశం, రేఖాంశం, తేదీ, సమయ ముద్ర, ఐపీ అడ్రస్ వంటివి ఎక్స్ఛేంజీల వద్ద నమోదు చేయాల్సి ఉంటుంది. పెన్నీ డ్రాప్ పద్ధతి అనుసరించాల్సి ఉంటుంది. దీనిలో బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ గా ఉందని, రిజిస్ట్రన్ట్ కు చెందినదని నిర్ధారించడానిక నామమాత్రంపు రూపాయి ట్రాన్సాక్షన్ చేస్తే ప్రాసెస్ చేస్తారు. పాన్ కార్డుతో పాటుగా వినియోగదారులు పాస్ పోర్ట్, ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ వంటి సెకండరీ గుర్తింపు కార్డు, ఇ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ కోసం ఓటీపీ ధ్రువీకరణ అందించాలి. ఇన్ని రకాల వివరాలు సేకరించడం ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడే అవకాశం ఉండదని, ఎవరైనా అక్రమ నగదు బదిలీ చేస్తే ఇట్టే తెలిసిపోతుందని కేంద్రం భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa