ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తన పర్యటనలో భాగంగా జ్యూరిచ్ నుంచి దావోస్కు బయల్దేరారు. జ్యూరిచ్లో ప్రవాస తెలుగువారితో సమావేశం ముగించుకున్న అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా దావోస్కు పయనమయ్యారు.అంతకుముందు జ్యూరిచ్లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాస తెలుగువారు పారిశ్రామికవేత్తలుగా మారేందుకు రూ.50 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదే పర్యటనలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో కూడా ఆయన భేటీ అయ్యారు.దావోస్ చేరుకున్న వెంటనే ఆయన కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. యూఏఈ ఆర్ధిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మార్రీ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వంటి పారిశ్రామిక, ప్రభుత్వ ప్రముఖులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ముఖ్యంగా ఏపీ-యూఏఈ మధ్య ఆర్ధిక, వాణిజ్య భాగస్వామ్యంపై చర్చించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa