ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ఒక 'ఏడుపుగొట్టు టీం'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 01:25 PM

"ఏపీలో ఉన్న టీం 11' ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? అని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ప్రశ్నించారు. పెట్టుబడుల కోసం తాము ప్రయత్నిస్తుంటే, ఏపీకి రావొద్దని ఆ 'ఏడుపుగొట్టు టీం' కంపెనీలకు ఈ-మెయిల్స్ పెడుతోందని ఆరోపించారు. కోడికత్తి, బాబాయి హత్య, ప్రజాధనంతో ప్యాలెస్ కట్టుకున్న క్రెడిట్ మాత్రమే వారికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన ఆయన, జ్యూరిచ్ లో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, పరోక్ష విమర్శలు గుప్పించారు."ఏపీలో టీం 11 ఉంది. అర్థమైందా రాజా? అదో ఏడుపుగొట్టు టీం. పెట్టుబడులు తీసుకువస్తామంటే ఏడుస్తారు. పెట్టుబడుల కోసం సింగపూర్ కు వెళితే.. ఏపీకి రావద్దని ఆ ఏడుపుగొట్టు టీం ఈ-మెయిల్స్ పెట్టే పరిస్థితి. కొన్ని కంపెనీలను కలిస్తే ఏపీకి రావొద్దంటూ వారికి కూడా ఈ-మెయిల్స్ పెడుతున్నారు. సీఎం చంద్రబాబు గారిని చూసి సదరు కంపెనీలు వస్తే మాత్రం క్రెడిట్ తీసుకోవాలనుకుంటారు. మళ్లీ క్రెడిట్ చోరీ అంటారు. టీం 11 ముఖం చూసి ఎవరైనా రాష్ట్రంలో పెట్టబడులు పెట్టడానికి వస్తారా? కోడికత్తికి వారికి క్రెడిట్ ఇవ్వాలి. బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి. చెల్లినీ, తల్లినీ గెంటేసిన క్రెడిట్ ఇవ్వాలి. రూ.700 కోట్ల ప్రజాధనంతో విశాఖలో ప్యాలస్ కట్టుకున్న క్రెడిట్ ఏడుపుగొట్టు టీంకి ఇవ్వాలి" అంటూ లోకేశ్ సెటైర్ల వర్షం కురిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa