ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే వాలంటీర్లను తీసుకోం-వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 08:07 PM

వాలంటీర్ వ్యవస్థ.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మానస పుత్రిక అని చెప్పొచ్చు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాలంటీర్లను, గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిని అనుసంధానం చేసి ప్రభుత్వ పథకాల లబ్ధిని, ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దనే అందజేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా ఉండేలా చూశారు. వారికి ప్రతి నెలా రూ.5000 చొప్పున గౌరవ వేతనం కూడా చెల్లిస్తూ వచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు.


ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ తెరమరుగైంది. వాలంటీర్ల నియామకం, వేతనాలపై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదని కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీంతో వాలంటీర్లు సైడ్ అయ్యారు. అయితే వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తారని ఎక్కువ మంది నమ్మకంతో ఉన్నారు. గతంలో వాలంటీర్లుగా నియమితులైన వారిలో ఎక్కువ మంది వైసీపీ సానుభూతిపరులేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి.. జగన్ మళ్లీ సీఎం అయితే వాలంటీర్ వ్యవస్థను మళ్లీ తెస్తారని చాలామంది నమ్మకం పెట్టుకున్నారు.


వాలంటీర్ల కారణంగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రజలకు చేరువ కాలేకపోయారని అభిప్రాయపడ్డారు. వాలంటీర్లను పక్కన పెడితే తప్ప వైసీపీ నేతలు, కార్యకర్తలకు న్యాయం జరగదని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అభిప్రాయపడ్డారు. కార్యకర్తలు, నేతలు ఉంటేనే పార్టీ ఉంటుందన్న బాలనాగిరెడ్డి.. వాలంటీర్లు లేకపోతే వైసీపీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చేదని అన్నారు.వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa