ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దావోస్‌ లో రేవంత్ రెడ్డితో సమావేశమైన లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 22, 2026, 06:27 PM

దావోస్‌ వేదికగా తెలుగు రాష్ట్రాల నేతల మధ్య స్నేహపూర్వక భేటీ జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అభివృద్ధి, ప్రగతి ప్రణాళికలపై ఇరువురు నేతలు ఫలవంతమైన చర్చలు జరిపారు. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల సమగ్రాభివృద్ధి సాధ్యమని ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో భాగంగా మంత్రి నారా లోకేశ్... సీఎం రేవంత్ రెడ్డిని మంగళగిరి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా లోకేశ్ ను సత్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న విద్యా సంస్కరణలు, ఐటీ రంగంలో సాధిస్తున్న ప్రగతిని లోకేశ్ ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా ‘ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ కోసం తీసుకుంటున్న చర్యలు, వాటి ద్వారా వస్తున్న సానుకూల ఫలితాల గురించి చర్చించారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి, తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి తెలిపారు. ముఖ్యంగా, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా టాటా సంస్థ సహకారంతో తెలంగాణలోని ఐటీఐలను ఆధునిక స్కిల్ క్యాంపస్‌లుగా తీర్చిదిద్దామని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ క్యాంపస్‌లను సందర్శించి, అక్కడ అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించాలని లోకేశ్ ను ఆయన ఆహ్వానించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa