ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమగ్ర భూ రీసర్వే విషయంలో కూడా చంద్రబాబు 'క్రెడిట్ చోరీ'కి పాల్పడుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 22, 2026, 06:32 PM

భూముల సమగ్ర రీసర్వే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 'క్రెడిట్ చోరీ'కి పాల్పడుతున్నారని జగన్ తీవ్రంగా ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన 'భూ రక్ష', 'భూ హక్కు' పథకాలను చంద్రబాబు హైజాక్ చేశారని, ఈ బృహత్కార్యంలో ఆయన పాత్ర ఏమాత్రం లేకపోయినా ఘనతను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తన పాదయాత్ర సందర్భంగా రైతులు భూ వివాదాలు, టైటిల్స్ సమస్యలపై తన వద్ద గోడు వెళ్లబోసుకున్నారని, అందుకే 2019 మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చామని గుర్తుచేశారు. తమ హయాంలో రూ.6,000 కోట్లు ఖర్చు చేసి, దాదాపు 40,000 మంది సిబ్బందిని నియమించి అత్యాధునిక టెక్నాలజీతో సమగ్ర భూ సంస్కరణలు చేపట్టామని, ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని తెలిపారు.కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక, రైతులకు గతంలో ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలను వెనక్కి తీసుకుని, వాటి రంగు మార్చి మళ్లీ ఇస్తూ మొత్తం ఘనత తనదేనని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ కొత్త పాస్‌బుక్‌లలో తప్పులు ఎక్కువగా ఉండటంతో రైతుల కష్టాలు మరింత పెరిగాయన్నారు. అంతేకాకుండా, ఈ పథకం అమలును ప్రశంసిస్తూ కేంద్రం ఇచ్చిన రూ.400 కోట్ల నిధులను కూడా టీడీపీ నాయకత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించడం సంచలనం రేపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa