ఏలూరు జిల్లా,బుట్టాయగూడెం మండలంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని కావడిగుండ్ల ప్రాంతం నుంచి ఏలూరు జిల్లాలోకి పులి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. పందిరిమామిడి గూడెం ప్రాంతంలో పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు.. దానిని పెద్ద పులిగా నిర్ధారించారు. అయితే.. అది వచ్చిన మార్గంలోనే వెనక్కి తిరిగి వెళ్లినట్లు పాదముద్రల ద్వారా గుర్తించారు.పులి సంచారం నేపథ్యంలో అంతర్వేదిగూడెం, ఇనుమూరు, గాడిదబోరు, పందిరిమామిడి గూడెం తదితర చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశువులు, ప్రజల భద్రత కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు.మరోవైపు.. పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వీలైనంత త్వరగా ఆ పులిని బంధించాలని పరిసర గ్రామస్థులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. పులి సంచారానికి సంబంధించి సమాచారం కోసం అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa