ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈయూతో భారత్ ట్రేడ్ డీల్.. భారీగా తగ్గనున్న ధరలు

business |  Suryaa Desk  | Published : Wed, Jan 28, 2026, 10:57 PM

భారత ఆర్థిక వ్యవస్థను మరో మెట్టు ఎక్కించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. చారిత్రాత్మక అడుగు వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కూటమిగా ఉన్నటువంటి ఐరోపా సమాఖ్యతో (యూరోపియన్ యూనియన్) భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. రెండింటి మధ్య ట్రేడ్ డీల్ కుదిరినట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా.. భారత మార్కెట్లోకి అంతర్జాతీయ బ్రాండ్లు వెల్లువెత్తనున్నాయని చెప్పొచ్చు. ఒకప్పుడు విదేశీ లగ్జరీ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు ఉండటంతో ఇవి చాలా ప్రియంగా ఉండేవి. ఇప్పుడు దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్న నేపథ్యంలో వాటి ధరలు భారీగా తగ్గనున్నాయన్నమాట.


ఇక్కడ ప్రధానంగా లగ్జరీ కార్లు, స్పిరిట్, వైన్‌తో పాటు ఇతర మెడికల్ ఉత్పత్తులపైనా సుంకాల భారం గణనీయంగా తగ్గుతుంది. ఈ డీల్ పూర్తి వివరాలు బయటికి రానప్పటికీ.. డీల్ ఖరారైన తర్వాత ఐరోపా సమాఖ్య చేసిన ప్రకటనతో కొన్ని ఉత్పత్తులపైన సుంకాల వివరాలు బయటికి వచ్చాయి.


స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వచ్చే సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఇక వెంటనే అప్పుడు 90 శాతానికిపైగా భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకాల్ని తగ్గించనున్నట్లు పేర్కొంది ఐరోపా సమాఖ్య. మిగతా ప్రొడక్ట్స్‌పై దశల వారీగా సుంకాల్ని తగ్గించనున్నట్లు వెల్లడించింది. ఇక ఒప్పందం అమల్లోకి వచ్చిన తొలి రోజు.. 30 శాతం వరకు ఐరోపా ఉత్పత్తులపై భారత్.. సుంకాల్ని ఎత్తివేయనుందని పేర్కొంది.


>> ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వైన్.. ఐరోపాలోనే తయారవుతుందన్న సంగతి తెలిసిందే. వీటిపై భారత్ 150 శాతం దిగుమతి సుంకాల్ని విధిస్తుంది. దీంతో ఇది భారత్‌కు వచ్చే సరికి ఖరీదైనదిగా మారుతుంది. ఈ సుంకాలు ఏడేళ్లలో ఏకంగా 20 శాతానికి దిగిరానుంది. రూ. 1000 విలువైన బాటిల్‌పై గతంలో దిగుమతి సుంకం రూ. 1500 గా ఉండగా.. ఇప్పుడు ఒప్పందంలో భాగంగా అది రూ. 200 గానే ఉంటుంది. మీడియం రేంజ్ వైన్‌పై సుంకం 30 శాతం వరకు తగ్గుతుంది.


ఇక లగ్జరీ కార్లపై (ఆటోమొబైల్ ఉత్పత్తులు) చూస్తే గతంలో భారత్ 66 శాతం నుంచి 125 శాతం వరకు దిగుమతి సుంకం విధించేది. ఈ సుంకాలు దశలవారీగా తగ్గనున్నాయి. తొలుత ఈ సుంకాల్ని 40 శాతానికి.. తర్వాత క్రమంగా 10 శాతానికి తగ్గించనున్నట్లు తెలుస్తోంది.


ఒప్పందం అమల్లోకి వచ్చిన ఐదేళ్లకు ఎలక్ట్రిక్ వాహనాలపై భారత్ సుంకాల తగ్గింపు మొదలవుతుంది. ముందు ఇది 30-35 శాతానికి తగ్గి.. తర్వాత మరింత తగ్గే అవకాశం ఉంది.


ఇంకా వైద్య పరికరాలపై కూడా చాలా వరకు సుంకాల్ని ఎత్తివేసే అవకాశం ఉంది. వీటిల్లో ఆప్టికల్స్, మెడికల్, సర్జికల్ పరికరాలపై సుంకాల్ని జీరోకు చేర్చే అవకాశం ఉంది.


యంత్రాలు 44 శాతం, కెమికల్స్‌పై 22 శాతంగా ఉన్న దిగుమతి సుంకాలు కూడా గణనీయంగా తగ్గనున్నాయి. వీటితో పాటు ఆలివ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్‌పైనా సుంకాల్ని ఎత్తివేయనున్నారు. సోయా మీల్, పప్పులు, డైరీ ఉత్పత్తులపై భారత్.. ఈయూకు సుంకాల మినహాయింపు ప్రకటించలేదు. ఇదే సమయంలో ఈయూ కూడా.. పౌల్ట్రీ, బీఫ్, మాంసం,చక్కెర వంటి వాటిపై కస్టమ్స్ డ్యూటీ తగ్







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa