ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్‌టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్

business |  Suryaa Desk  | Published : Thu, Jan 29, 2026, 07:26 PM

భారతదేశంలో ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ తన 36 కోట్ల మంది వినియోగదారులకు ప్రపంచంలోనే తొలిసారిగా అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంను ఉచితంగా అందిస్తోంది. సుమారు రూ.4,000 విలువైన ఈ ప్రీమియం ప్యాకేజీని ఎయిర్‌టెల్ యూజర్లు ఏడాది పాటు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చు. అడోబ్ ఎక్స్‌ప్రెస్ అనేది డిజైన్ అనుభవం లేకపోయినా, ప్రొఫెషనల్ స్థాయి పోస్టర్లు, సోషల్ మీడియా కంటెంట్, వీడియోలు, ఆహ్వాన పత్రికలు, మార్కెటింగ్ మెటీరియల్ రూపొందించడానికి సహాయపడే యాప్. ఇది ఇంగ్లీష్ తో పాటు హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో లాగిన్ అయి ఈ సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa