ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 04, 2026, 09:48 PM

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల (స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు) ఉద్యోగులకు శుభవార్త. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారులతో సచివాలయాల శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయాల ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రమోషన్లు, మూడంచెల వ్యవస్థపై అధికారులతో మంత్రి ఈ సందర్భంగా చర్చించారు. ఈ క్రమంలోనే స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలపై పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఓ అధికారిని, ప్రతి మండలానికి ఓ ఆఫీసర్‌ను డిప్యూటేషన్ పద్ధతిలో నియమించనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు అందరికీ (స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు) ప్రమోషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.


సచివాలయాల సిబ్బంది పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నామన్న మంత్రి... ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. మార్చిలోపు వీటిని భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు, మూడు చక్రాల మోటార్ బైకుల పంపిణీ విషయాలపై చర్చించారు.


 అలాగే దివ్యాంగ పాఠశాలల్లో చేరికలు, వయోవృద్ధులకు అందించే వయో వందన ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీపైనా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి చర్చించారు. ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డుల జారీతో పాటుగా నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై సమీక్షించారు. దివ్యాంగ పాఠశాలల్లో అడ్మిషన్ల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు. దివ్యాంగ పాఠశాలల్లో వందశాతం అడ్మిషన్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఏవైనా మరమ్మతులు ఉంటే పూర్తి చేయాలని.. ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


విద్యార్థులకు అందించే ఆహారం మెనూ అమలులో రాజీ వద్దని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు దివ్యాంగులకు ప్రభుత్వం త్రీవీలర్ మోటార్ సైకిళ్లు ఉచితంగా పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అర్హులైన లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. వయో వృద్ధులకు అందించే సహాయ పరికరాలు ఎక్కువ మందికి అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa