ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలు లేవన్న బీసీసీఐ

sports |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 06:18 AM

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న పుకార్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి  సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టత ఇచ్చారు. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, చాలా స్నేహపూర్వక వాతావరణంలోనే కలిసి పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు.గంభీర్ భారత జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కోహ్లీతో అతడి సంబంధాలపై క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన వాగ్వాదాల నేపథ్యంలో ఇప్పటికీ వారి మధ్య దూరం ఉందని కొన్ని కథనాలు వెలువడ్డాయి.ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన దేవజిత్ సైకియా ఈ పుకార్లను కొట్టిపారేశారు.నేను వారిద్దరినీ ఎప్పుడూ గొడవపడగా చూడలేదు. వారి మధ్య చాలా మంచి స్నేహపూర్వక సంబంధం ఉంది అని స్పష్టం చేశారు. ఐపీఎల్ ఘటన గురించి ప్రస్తావించగాఆ సమయంలో తాను జాతీయ జట్టుతో ఉన్నాననిఆ మ్యాచ్ చూడలేదని సమాధానమిచ్చారు.గంభీర్ కోచ్‌గాకోహ్లీ కీలక ఆటగాడిగా ఉన్నప్పుడే భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయం వారిద్దరి మధ్య వృత్తిపరంగా మంచి సమన్వయం ఉందనడానికి నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు. గంభీర్ హయాంలోనే కోహ్లీ 2025లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం 37 ఏళ్ల కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత ఆరు వన్డేల్లో మూడు సెంచరీలు ఒక అర్ధసెంచరీ  సాధించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa