టీ20 ప్రపంచకప్లో భాగంగా దాయాదుల పోరుపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. భారత్తో ఆడే విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెనక్కి తగ్గి, మ్యాచ్కు సిద్ధమని ప్రకటించడంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. ఈ కీలక మ్యాచ్కు కొలంబో వేదిక కానుండటంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఇప్పుడంతా శ్రీలంక బాట పడుతున్నారు. ఈ పరిణామంతో అటు క్రీడా లోకంలోనూ, ఇటు పర్యాటక రంగంలోనూ ఒక్కసారిగా సందడి మొదలైంది.
పాకిస్థాన్ జట్టు 'యూటర్న్' తీసుకుని ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిమిషాల్లోనే కొలంబోకు వెళ్లే విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. డిమాండ్కు అనుగుణంగా విమానయాన సంస్థలు ధరలను భారీగా పెంచేయడం గమనార్హం. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే టికెట్ ధరపై దాదాపు రూ. 10 వేల వరకు అదనపు భారం పడిందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. దాయాదుల యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులకు ఈ ధరల పెరుగుదల ఇప్పుడు గట్టి షాక్గా మారింది.
ప్రస్తుత సమాచారం ప్రకారం, కొలంబోకు వెళ్లి రావడానికి (రౌండ్ ట్రిప్) టికెట్ ధర సుమారు రూ. 60 వేల మార్కును తాకింది. సాధారణ రోజులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువైనప్పటికీ, మ్యాచ్ క్రేజ్ దృష్ట్యా అభిమానులు వెనకాడటం లేదు. బుకింగ్స్ విపరీతంగా జరుగుతుండటంతో విమాన సర్వీసులు కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. భారత్-పాక్ మ్యాచ్ అంటే ఉండే మజాయే వేరు కాబట్టి, ఎంత ఖర్చయినా సరే స్టేడియంలో ఉండి మ్యాచ్ చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.
అయితే అసలు మజా ముందుందని, మ్యాచ్కు ఇంకా ఐదు రోజుల సమయం ఉండటంతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చివరి నిమిషంలో టికెట్లు కొనుగోలు చేసే వారికి లక్ష రూపాయల వరకు ఖర్చయినా ఆశ్చర్యపోనక్కర్లేదని సమాచారం. హోటల్ అద్దెలు, ఇతర ప్రయాణ ఖర్చులు కూడా ఇదే రీతిలో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి భారత్-పాక్ మ్యాచ్ మైదానంలో ఆటగాళ్ల మధ్యే కాకుండా, టికెట్ రేట్ల విషయంలోనూ భారీ పోటీని సృష్టిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa