ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) 25 లాంగ్ డిస్టెన్స్ మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఇ-ప్యాంట్రీ సేవను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన భోజనాన్ని ముందస్తుగా బుక్ చేసుకుని, నిర్దేశిత స్టేషన్లలో డెలివరీ పొందవచ్చు. ఇది ప్రయాణీకులకు సౌలభ్యాన్ని, సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తుంది. ఈ-ప్యాంట్రీ మోడల్ కింద IRCTC ఆథరైజ్డ్ సెల్లర్ల నుండి ఆహారాన్ని ఎంచుకోవచ్చు. ఈ సేవను మరిన్ని రైళ్లకు విస్తరించే అవకాశం ఉంది. ప్రయాణీకులు IRCTC సైట్ www.irctc.co.in లో వివరాలు చూడవచ్చు.కన్ఫమ్ టికెట్, ఆర్ఏసీ, పాక్షికంగా టికెట్ కన్ఫమ్ అయిన ప్రయాణికులు ఇ-ప్యాంట్రీ ద్వారా ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ప్యాంట్రీ కార్ స్టాఫ్ సీటు దగ్గరకే ఆహారాన్ని డెలివరీ చేస్తారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో ‘బుక్డ్ టికెట్ హిస్టరీ’ సెక్షన్లో ఇ-ప్యాంట్రీ మీల్ ఆప్షన్ కనిపిస్తుంది. మీల్ బుక్ చేసుకున్నాక మీల్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దాన్ని డెలివరీ సమయంలో చూపించాలి. విశాఖ నుంచి వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ కూడా ఈ జాబితాలో ఉంది. దశలవారీగా మిగిలిన రైళ్లకూ విస్తరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa