ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి 14 రోజుల రిమాండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 12, 2026, 08:43 PM

వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు మరో కేసులో రిమాండ్ పడింది. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా కేసులో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో, 2023 జనవరిలో అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్ల ద్వారా పింఛనుదారుల నుంచి రూ.200 చొప్పున అక్రమంగా వసూలు చేసి, వారికి బలవంతంగా లాటరీ టికెట్లు అంటగట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోర్టులో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రస్తుతం మరో కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటిని, పోలీసులు పీటీ వారెంట్‌పై ఇవాళ గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి ఎం. కుముదిని, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అంబటిని తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు.సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్ లభించగా, గతేడాది మెడికల్ కాలేజీ అంశంపై నిర్వహించిన ఆందోళనల్లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న కేసులోనూ ఆయనకు బెయిల్ లభించింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ రావడంతో అంబటి విడుదల కావడం లాంఛనమేనని అందరూ అనుకున్నారు. అయితే, పోలీసులు సంక్రాంతి లక్కీ డ్రా కేసులో పీటీ వారెంట్ పై కోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో అంబటికి నిరాశే మిగిలింది. తాజా రిమాండ్‌తో ఆయన విడుదల ఆగిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa