చిత్తూరు కలెక్టరేట్ వద్ద భూ వివాదాల నేపథ్యంలో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తమ భూమిని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో వెదురు కుప్పం మండలం పచ్చికాపల్లం గ్రామానికి చెందిన సాయికుమార్ ఈ చర్యకు పాల్పడ్డాడు. అధికారుల తీరుపై విరక్తి చెంది ఈ దుశ్చర్యకు పాల్పడ్డానని బాధితుడు తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa