జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి అమెరికా న్యాయ విభాగం (DOJ) తాజాగా విడుదల చేసిన పత్రాల్లో బాధితుల్లో ఒకరు భారత్లో ఉన్నట్లు తేలింది. ఆమెకు పరిహారం అందించి, ఆదుకునేందుకు అమెరికా అధికారులు ప్రయత్నించినట్లు ఈ పత్రాల ద్వారా స్పష్టమవుతోంది.2020 జనవరి 13 నాటి అంతర్గత ఈ-మెయిల్లో ఈ వివరాలు ఉన్నాయి. 'EFTA00038425' నంబర్ గల ఈ డాక్యుమెంట్లో "చివరగా.. ప్రస్తుతం భారత్లో నివసిస్తున్న ఆమెకు మనం ఎలా సహాయం చేయగలం? ఆమెకు ఏమైనా వనరులు అందించగలమా?" అని బాధితుల తరఫు న్యాయవాది ఒకరు అధికారులను ప్రశ్నించారు. దీనికి ఓ అధికారి స్పందిస్తూ "భారత్లో ఉన్న ఆ వ్యక్తి చిరునామా, సంప్రదింపుల వివరాలు అందిస్తే, అక్కడి మా రాయబార కార్యాలయ సిబ్బందితో సమన్వయం చేసుకుంటాం" అని బదులిచ్చారు.బాధితులకు పరిహారం అందించే నిధి నుంచి ఆమెకు ఆర్థిక సాయం అందించాలని, అవసరమైతే థెరపీ సెషన్లకు కూడా ఏర్పాట్లు చేయాలని ఈ-మెయిల్లో చర్చించుకున్నారు. బాధితురాలు దరఖాస్తు పూర్తిచేస్తే ఆ పత్రాలను ఎఫ్బీఐకి పంపనున్నట్లు కూడా పేర్కొన్నారు. ఈ సంభాషణ జరిగిన సమయంలో ఎప్స్టీన్ జైలులో ఆత్మహత్య చేసుకొని కొన్ని నెలలు మాత్రమే గడిచింది.అయితే, ఈ పత్రాల్లో బాధితురాలి పేరు, జాతీయత వంటి వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa