దేశీయ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ లావా బడ్జెట్ ప్రియుల కోసం సరికొత్త మొబైల్ 'లావా బోల్డ్ N2'ను మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలో ప్రీమియం లుక్, క్లీన్ సాఫ్ట్వేర్ అనుభవాన్ని కోరుకునే వారిని టార్గెట్గా చేసుకుని ఈ ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్ ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ రూ.7,499కే లభ్యం కానుంది.లావా బోల్డ్ N2లో 6.75 అంగుళాల HD+ (720 x 1600 పిక్సెల్స్) LCD డిస్ప్లేను అందించారు. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, యాప్ నావిగేషన్ సాఫీగా ఉంటుంది. ఈ ఫోన్ 1.6GHz ఆక్టా-కోర్ Unisoc SC9863A ప్రాసెసర్తో పనిచేస్తుంది. 4GB RAMతో పాటు 4GB వరకు వర్చువల్ గా పెంచుకునేందుకు సపోర్ట్ ఉంది. 64GB స్టోరేజ్తో వస్తున్న ఈ ఫోన్ మైక్రోSD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్ పై నడుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa