అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరపు మొదటిార్థంలో భారత ఆర్థిక వృద్ధి కొంత మందగించే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ Fitch Ratings హెచ్చరించింది.చమురు ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉందని సంస్థ తన విశ్లేషణలో పేర్కొంది. దీనివల్ల సాధారణ ప్రజల వాస్తవ ఆదాయం తగ్గి, వినియోగ ఖర్చులపై ప్రతికూల ప్రభావం పడవచ్చని తెలిపింది.తాజాగా విడుదల చేసిన Global Economic Outlook నివేదికలో ఫిచ్ ఈ విషయాలను వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 6.7 శాతంగా సవరించింది. అలాగే డిసెంబర్ 2026 నాటికి ద్రవ్యోల్బణం సుమారు 4.5 శాతానికి చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.ఇటీవల జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆర్థిక కార్యకలాపాలు కొంత మందగిస్తున్న సంకేతాలు కనిపించినప్పటికీ, బ్యాంకు రుణాల జారీ మాత్రం రెండంకెల వృద్ధి నమోదు చేసే అవకాశముందని ఫిచ్ తన నివేదికలో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa