ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేనమామే కాలయముడయ్యాడు...బాలిక నోట్లు యాసిడ్ పోసి ఆపై గొంతుకోసి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 10:09 PM

కంటికి రెప్పలా కాపాడాల్సిన మేనమామయే ఆ బాలిక పాలిట కాలయముడయ్యాడు. నెల్లూరు జిల్లాలో ఓ బాలిక నోట్లో యాసిడ్ పోసి, గొంతుకోసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితుడు లైంగిక దాడికి యత్నించగా, ఆమె ప్రతిఘటించడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు తొలుత కథనాలు వచ్చాయి. అయితే, ఈ కేసులో పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఆ 14 ఏళ్ల బాలికపై దాడి చేసింది మేనమామ నాగరాజు అని పోలీసులు వెల్లడించారు. నాగరాజు వ్యసనాలకు బానిసయ్యాడని, డబ్బు కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు. ఇదిలావుంటే బాలికపై అత్యాచారం జరగలేదని, నెల్లూరు రూరల్ డీఎస్పీ హరనాథ్ రెడ్డి వెల్లడించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. మైనర్ బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa