తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం మూసివేయడం అరుదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్పా ఆలయం మూతపడదు. ఈ ఏడాది సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం సంభవించనున్నాయి. ఈ రెండు రోజుల్లో గ్రహణ సమయంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. అక్టోబరు 25న ఏర్పడనున్న సూర్యగ్రహణం కారణంగా ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు... నవంబరు 8వ తేదీన చంద్రగ్రహణం వల్ల ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది.
ఈ రెండు గ్రహణాల రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్టు దర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత బ్రహ్మోత్సం, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేస్తున్నట్టు టీటీడీ వివరించింది. ఈ రెండు రోజుల పాటు గ్రహణం వీడిన తర్వాత శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసి కేవలం సర్వదర్శన భక్తులనే స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపింది. భక్తులు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa