వరకట్నం వేధింపు కేసు నమోదు చేసినట్లు కలకడ హెడ్ కానిస్టేబుల్ శనివారం తెలిపారు. కలకడకు చెందిన మక్బూల్ బాష, కుమార్తె షహతాజ్ ను అన్నమయ్య జిల్లా, సంబేపల్లి మండలం, దేవపట్లకు చెందిన షేక్ మహబూబ్ బాష కుమారుడు ఖాదర్ వలీతో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. ఖాదరవలీ మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతూ అదనపు కట్నం కోసం తన తల్లిదండ్రులతో కలసి వేధిస్తున్నాడని షహతాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్. సి. తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa