బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. ఇదిలావుంటే ఇటీవలే అస్తమించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు సంబంధించిన అత్యంత ఆసక్తికర అంశం వెల్లడైంది. బ్రిటన్ రాణి రాసిన ఓ లేఖ ఆస్ట్రేలియాలో ఇప్పటికీ భద్రంగా ఉంది. విశేషం ఏంటంటే... ఆ లేఖను ఇంతవరకు తెరవలేదు. అంతేకాదు, 2085 వరకు ఆ లేఖను ఎవరూ తెరిచే వీల్లేదు. అది రాణి కోరిక. ఆ లేఖను 1986లో సిడ్నీ ప్రజలను ఉద్దేశించి రాణి రాశారు. 2085లోనే ఈ లేఖను తెరవండి అంటూ నాడు సిడ్నీ నగర మేయర్ కు రాణి సూచన చేశారు. ఆ లేఖలోని సందేశాన్ని సిడ్నీ ప్రజలకు అందించండి అని ఆమె పేర్కొన్నారు. రాణి సంతకంతో కూడిన ఆ లేఖను సిడ్నీలోని క్వీన్ విక్టోరియా హాల్ లో భద్రపరిచారు. రాణి అస్తమయం నేపథ్యంలో ఈ లేఖ సంగతి బయటికి వచ్చింది. అన్నేళ్ల పాటు తెరవొద్దని సూచించేందుకు, ఆ రాణి ఆ లేఖలో ఏం రాశారన్నది చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa