గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 45వార్డు తాటిచ్చెట్ల పాలెం బజార్ సోనియా గాంధీ నగర్, రజకులు కోలని ప్రాంతాల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె. కె రాజు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనుక్ తో కలిసి పర్యటించారు. అంతక ముందు శ్రీశ్రీశ్రీ వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు.
ఈ సందర్భంగా కె. కె రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై. యస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని నాడు ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్రలో ప్రజల ఆర్థిక ఇబ్బందులను నేరుగా తీసుకున్నారని దానికి అనుగుణంగా నేడు విద్య, వైద్యం, ఉపాధి ప్రతి పేదవాడికి అందేవిధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై. యస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో 45వార్డు అధ్యక్షులు పైడి రమణ, డైరెక్టర్లు కె. పి రత్నాకర్, యన్. రవి కుమార్, రాయుడు శ్రీను, ప్రసాద్, 45వార్డు నాయకులు హరిపట్నాయక్, నాగరాజు, బాబురావు, గణపతి, నేపాల్ శ్రీను, సన్నీ,
మహేష్, ఆదిలక్ష్మీ, సువర్ణ, జోగినాయుడు, నాయుడు, దుర్గా, ఏకప్, సీనియర్ నాయకులు చిరంజీవి, వసంతల అప్పారావు, షేఖ్ బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa