ఏపీ ప్రభుత్వానికి ఊరాటనిచ్చేలా ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏదైనా జిల్లాకు ఏ పేరు పెట్టాలన్నది ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయమని తేల్చి చెప్పింది హైకోర్టు. జిల్లాకు ఫలానా వ్యక్తి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం కోర్టు పని కాదని.. ఏదైనా జిల్లాకు లేదా పట్టణానికి రాజకీయ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, యోగి, ఇతర ప్రఖ్యాత వ్యక్తి పేరు పెట్టడం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశమని వ్యాఖ్యానించింది. ఒకవేళ కోర్టు అలాంటి ఆదేశం ఇవ్వాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు, ప్రజల చట్టబద్ధ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు పిటిషనర్ నిరూపించాల్సి ఉంటుందని తెలిపింది.
జిల్లాలకు పేరు పెట్టే విషయంలో నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన చట్టం ఏదీ లేదని అభిప్రాయపడింది హైకోర్టు. జిల్లాకు పేరుపెట్టే విషయంలో చట్టపరంగా ఎలాంటి ప్రమాణాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది. కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లాకు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పేరు పెట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిల్పై హైకోర్టు విచారణ జరిపగా.. ఇటీవల వాదనలు ముగియడంతో ధర్మాసనం ఈ పిల్ను కొట్టేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa