ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విద్యాశాఖ సలహాదారుగా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎ. మురళి శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పంపారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలా మందిని జగన్ ప్రభుత్వానికి సలహాదారులుగా నియమించిన సంగతి తెలిసిందే. వీరిలో చాలా మంది తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. ఏపీ విద్యాశాఖ సలహాదారుగా తెలంగాణకు చెందిన మురళి నియమితులయ్యారు. గత మూడేళ్లుగా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ సలహాదారు పదవికి ఎందుకు రాజీనామా చేస్తున్నానో మురళి సీఎం జగన్ కు రాసిన లేఖలో వివరించారు. సొంత రాష్ట్రమైన తెలంగాణలో విద్య, వైద్య పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, ఆ పరిస్థితులను చక్కదిద్దేందుకే సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa