అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత శైలజ పిల్లలతో కలిసి పురుగుల మందు తాగి భార్య, బిడ్డ మృతిచెందిన సంఘటనలో భర్త సంపంగి మోహనకృష్ణను పోలీసులుశనివారం అరెస్టు చేశారు. అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత శైలజ పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో ఆమెతో పాటు చిన్నారి అక్షిత మృతిచెందిన సంగతి విదితమే. భర్త వేధింపులే దీనికి కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శైలజ భర్తను పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సి. ఐ. ప్రసాద్ తెలిపారు. ఈ సంఘటనలో శైలజ పెద్దకుమార్తె తుషిత(4) ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వైద్యుల పరిశీలనలోనే ఉందని ఇంకా 72 గంటలు పరిశీలనలో ఉంచాల్సి ఉందని వైద్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa