ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ

national |  Suryaa Desk  | Published : Thu, Oct 06, 2022, 01:05 PM

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర- ఇవ్వాళ పునఃప్రారంభమైంది. ప్రస్తుతం కర్ణాటకలో ఈ యాత్ర కొనసాగుతోంది.దసరా పండగను పురస్కరించుకుని రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు బ్రేక్ తీసుకున్నారు. ఈ ఉదయం మండ్య జిల్లాలోని పాండవపురాలో యాత్రను పునఃప్రారంభించారు. సోనియాగాంధీ అక్కడే రాహుల్‌ను కలుసుకున్నారు.


భారత్ జోడో యాత్రను కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అదే స్థాయిలో నిర్వహిస్తోన్నారు. యాత్రను విజయవంతం చేయడానికి కేపీసీసీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఇవ్వాళ ఈ యాత్రలో ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ సైతం పాల్గొనడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్టయింది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ సహా పలువురు నాయకులు సోనియాను కలిశారు. సోనియా గాంధీ-రాహుల్‌తో కలిసి జోడో యాత్రలో పాల్గొన్నారు. దారి పొడవునా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వారికి స్వాగతం పలికారు.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa