ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బన్నీ ఉత్సవాలలో అరవై మందికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 06, 2022, 01:53 PM

ఓ ఆచారంగా కొనసాగుతున్న దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు ముగిశాయి. ఈసారి కూడా దేవరగట్టు కర్రల సమరంలో రక్తం చిందింది. ఉత్సవ విగ్రహాల కోసం 10 గ్రామాల ప్రజలు కొట్టుకున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కర్రల సమరం సాగింది. ఈ కర్రల సమరంలో దాదాపు 60 మంది భక్తులకు గాయాలయ్యాయి. పలువురికి తలలు పగిలాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి ఆస్పత్రిలో తాత్కాలిక చికిత్స జరుగుతోంది. మెరుగైన చికిత్స కోసం పలువురిని ఆదోని ఆస్పత్రికి తరలించారు. ఈ బన్నీ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించిన 2 లక్షల మంది తిలకించారు. కాగా.. ఈ బన్నీ ఉత్సవాలు చూసేందుకు వచ్చి వీరారెడ్డి (17) అనే యువకుడు గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడు ఆదోని మండలం ఎడ్డవల్లి గ్రామ వాసిగా అధికారులు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa