అత్తమీద కోపం దుత్తపై అన్నట్లుగా ఓ వ్యక్తి తన కోపాన్ని బస్సులో పయనిస్తున్న వారిపై చూపాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వద్ద ఆర్టీసీ ఇంద్ర బస్సులో ఓ వ్యక్తి దుశ్చర్యకు పాల్పడ్డాడు. బస్సులోని ప్రయాణికులపై కారం చల్లాడు. ఆ సమయంలో బస్సు హైదరాబాద్ నుంచి రాజోలు వెళుతోంది. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి పేరు గుడాల రాంబాబు అని, స్వస్థలం ఆచంట మండలం అయోధ్యలంక అని వెల్లడైంది. రాంబాబు దుబాయ్ వెళ్లేందుకు హైదరాబాద్ వెళ్లాడు. అయితే శంషాబాద్ విమానాశ్రయంలో అతడి పాస్ పోర్టును అధికారులు తిరస్కరించారు. ఈ కారణంగానే అతడు బస్సులో దుశ్చర్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa