ప్రజా సమస్యలు పట్టని ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య తక్షణమే రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం గజపతినగరం నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితి పై గజపతినగరం మండల పార్టీ అధ్యక్షుడు అట్టాడ లక్ష్మనాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత క్వారీ వ్యాపారం కోసం రోడ్డు వేసుకున్న ఎమ్మెల్యే అప్పలనరసయ్య ప్రజలకు అవసరమైన రోడ్లు కనిపించలేదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పట్టని ఎమ్మెల్యే తక్షణమే రాజీనామా చేయాలన్నారు.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు నిర్వహణ పేరు సరిగ్గా లేక పాడై పోవడంతో అనేకమంది ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో రోడ్లు ఇంకా అధ్వానంగా ఉన్నాయని దానికి గజపతినగరం లో ఉన్న ప్రధానమైన రోడ్డు నిదర్శనమన్నారు. గజపతినగరం జాతీయ రహదారిపై ఉన్న గుంతల కారణంగా పలువురు మరణించినా ఎమ్మెల్యే బాధ్యతగా వ్యవహరించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నాయుడు గుంతల చుట్టూ సున్నం వేస్తూ నిరసన తెలియజేయడంతో పాటు గుంతల రోడ్లలో వాహనాలు జాగ్రత్తగా నడుపుతున్న డ్రైవర్లకు పువ్వులు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పి. వి. వి గోపాలరాజు, వేమలి చైతన్యబాబు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa