తిరుమల శ్రీవారిని మంగళవారంనాడు ప్రముఖులు దర్శించుకొన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ సంస్థల అధినేత అనిల్ అంబానీ, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం స్వామివారి అర్చన సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అర్చకలు శ్రీవారి తీర్థప్రసాదాలను వారికి అందజేసి వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి దర్శనం నిమిత్తం ప్రత్యేక విమానంలో ముంబై నుంచి వారు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు.
విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి కూడా తిరుమలేశుడి సేవలో పాల్గొ్న్నారు. అధికారులు ఆలయ మర్యాదల ప్రకారం ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వవాహక అధికారులపై స్వాత్మానందేంద్ర సరస్వతి ప్రశంసలు కురించారు. ప్రతి భక్తుడు స్వామివారి సేవలో తరించేవిధంగా టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేసిందన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలని.., పాడి పంటలు సమృద్ధిగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు స్వాత్మానందేంద్ర సరస్వతి వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa