ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సిటీ అఫ్ డెస్టినీ' గా విశాఖ గురించే చెప్పేలా చంద్రబాబు చేశారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 13, 2022, 10:56 PM

విశాఖ పట్టణం గురించి  టీడీపీ సోషల్  మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ఏపీలోని ప్ర‌ధాన న‌గ‌రం విశాఖ‌ప‌ట్నంను గ‌తంలో హుద్‌హుద్ తుఫాను అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. విశాఖ‌పై హుద్‌హుద్ విరుచుకుప‌డి నేటికి స‌రిగ్గా 8 ఏళ్లు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని విప‌క్ష టీడీపీ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్‌ను పెట్టింది. 6.17 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను కూడా త‌న పోస్ట్‌కు జ‌త చేసింది. హుద్‌హుద్ సంద‌ర్భంగా విశాఖ‌లో నెల‌కొన్న ప‌రిస్థితులు, ఆపై విశాఖ‌ను చంద్ర‌బాబు ప‌రిశీలించ‌డం, విశాఖ పున‌ర్నిర్మాణంపై దృష్టి సారించ‌డం, ఆయా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల స్పంద‌న‌ల‌తో కూడిన ఈ వీడియోను టీడీపీ పోస్ట్ చేసింది. ఇక ''నాడు ప్రచండ తుఫానుకు పడిపోయిన విశాఖను, నుంచోబెట్టి, ఊతమిచ్చి, పరిగెత్తించింది చంద్రబాబు గారు.. నేడు విశాఖను కబళిస్తున్న జే-బ్యాచ్ నుంచి విశాఖను కాపాడి, మళ్ళీ 'సిటీ అఫ్ డెస్టినీ' గా ప్రపంచం మొత్తం చెప్పుకునేలా చేసేది కూడా చంద్రబాబు గారే''న‌ని టీడీపీ ఓ కామెంట్‌ను పోస్ట్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa