ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 23, 2022, 11:33 AM

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా కాకినాడ  జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS గారి  ఆదేశాల మేరకు పెద్దాపురం ఇన్చార్జ్ డిఎస్పీ సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో పెద్దాపురం సిఐ, సామర్లకోట సిఐ,పెద్దాపురం SI ల ఆధ్వర్యంలో పెద్దాపురం రోటరీ బ్లడ్ బ్యాంక్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని  జిల్లా అడిషనల్ ఎస్పీ పి.శ్రీనివాసరావు గారు ప్రారంభించారు.


ఈ రక్తదాన శిబిరంలో పెద్దాపురం ఎస్.ఐ.  రావూరి మురళీమోహన్, జగ్గంపేట ఎస్.ఐ. రఘునాద్ రావు మరియు పలువురు పోలీసు సిబ్బంది పెద్దాపురం, జగ్గంపేట గండేపల్లి ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. 100 మందికి పైగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన దాతలను జిల్లా ఎస్పీ గారు అభినందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa