ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓర్వలేక వైసీపీ కుట్రలు చేస్తోంది: నాదెండ్ల మనోహర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 23, 2022, 09:03 PM

జనసేనకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ కుట్రలు చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్  విమర్శించారు. ఇటీవల విశాఖలో జరిగిన పరిణామాలు, మంగళగిరిలో పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రులపై జనసేన శ్రేణులు దాడి చేసే అవకాశాలున్నాయంటూ దుష్పచారం జరుగుతోందని ఆయన వెల్లడించారు.ఈ తప్పుడు ప్రచారాన్ని తాము ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతో జనసేనపై మరో కుట్రకు తెరదీశారని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాలు ఎవరు చేస్తున్నారో తమకు తెలుసని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ కుట్రపై డీజీపీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వైసీపీ కుట్రలను జనసైనికులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa