ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 24, 2022, 06:21 PM

తండ్రి మందలించాడని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం .... పినపెంకి గ్రామానికి చెందిన రెడ్డి చందు(22) ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని జగదాల్‌పూర్‌లోగల ఒక కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, ఈనెల 18న సెలవుపై ఇంటికి వచ్చాడు. ఎటువం టి పనిలేకుండా సెలవుపై ఎందుకు వచ్చావని తండ్రి మహేష్‌ చందును మంద లించాడు. దీంతో మనస్తాపానికి గురైన చందు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చందును ప్రథమ చికిత్స కోసం బాడంగి పీహెచ్‌సీకి తరలించారు.  అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్‌ కానిస్టేబుల్‌ వరప్రసాద్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa