ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీల కోసం ఎన్నో పథకాలను సీఎం తెచ్చారు: తమ్మినేని సీతారాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 27, 2022, 08:28 PM

సీఎం జగన్ బీసీల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చి అమలు చేస్తున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్  తమ్మినేని సీతారాం వెల్లడించారు. తాడేపల్లిలో నిర్వహించిన వైసీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనంలో తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేశారని కొనియాడారు. బీసీలు, ఇతర వెనుకబడిన వర్గాల రాజకీయ, ఆర్థిక సాధికారత కోసం పాటుపడుతున్న సీఎం జగన్ గొప్ప సంఘసంస్కర్తగా చరిత్రలో నిలిచిపోతారని తమ్మినేని తెలిపారు. ఈ మూడున్నరేళ్లలో బీసీల కోసం వైసీపీ చేసింది ప్రారంభం మాత్రమేనని అన్నారు. సీఎం జగన్ దార్శనికతతో కూడిన నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీ నేతలపై ఉందని స్పష్టం చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa