ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీలకు సామాజిక న్యాయం వర్తింపజేసిన నాయకుడు సీఎం జగన్ : సజ్జల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 27, 2022, 08:19 PM

ఏపీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం బీసీలను ఏనాడూ పట్టించుకోకపోగా, జగన్ అధికారంలోకి వచ్చి బీసీల ఆకాంక్షలకు పెద్దపీట వేసారు అని తెలిపారు. బీసీలకు సామాజిక న్యాయం వర్తింపజేసిన నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. వివిధ స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించారు. వైసీపీ తరపున బీసీ నేత ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందని సజ్జల అన్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa