ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో రెండు లక్షల కేజీల గంజాయి ధ్వంసం చేసాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 28, 2022, 11:59 AM

రాష్ట్ర ప్రభుత్వం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతోందని హోం మంత్రి తానేటి వనిత  పేర్కొన్నారు. ఆపరేషన్‌ పరివర్తన్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 10 మండలాలోని 313 గ్రామాల్లో 7,552 ఎకరాల విస్తీర్ణంలోని రూ.9,251 కోట్ల విలువైన గంజాయి సాగును ధ్వంసం చేశారన్నారు.  రాష్ట్రంలో రెండు లక్షల కేజీల గంజాయి ధ్వంసం చేశామని హోం మంత్రి  తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన సూరజ్‌ఖండ్‌లో రెండు రోజుల పాటు జరిగే చింతన్‌ శిబిర్‌కు ఆమె హాజరయ్యారు.  ఈ సంద‌ర్భంగా ఆమె ఏపి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa