వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ పరిపాలన రాజధాని చేయాలని జామి మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. జామి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జామి ఎంపీపీ సబ్బవరపు అరుణ అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వికేంద్రీకరణకు మద్దతుగా సభ్యులు ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదం తెలిపారు. సమావేశానికి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను),ఎస్ కోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa