ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్యకర్త కుమార్తెకు బాసటగా నిలిచిన టీడీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 28, 2022, 08:46 PM

కార్యకర్తలను కాపాడుకోవడంలో ముందుంటున్న టీడీపీ తాజాగా మరో వితరణ చేపట్టింది. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ టీడీపీ నేత కుమార్తెకు ఆపరేషన్ కు అవసరమైన రూ.15 లక్షలను ఆ పార్టీ అగ్ర నేత నారా లోకేశ్ అందజేశారు. ఈ మేరకు శుక్రవారం రూ.15 లక్షల చెక్కును బాలిక తండ్రి గాజుల మురళీకృష్ణకు ఆయన అందజేశారు. ఈ మొత్తాన్ని టీడీపీ ఎన్నారై అమెరికా విభాగం సేకరించింది. ఆ మొత్తాన్నే నారా లోకేశ్ బాధిత కుటుంబానికి అందజేశారు. 


కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ నేత మురళీకృష్ణ కుమార్తె గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వైద్యులకు చూపించగా...బాలికకు ఆపరేషన్ చేయాలని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎన్నారై అమెరికా విభాగానికి చెందిన కీలక నేత కోమటి జయరామ్ నిధుల సేకరణకు పూనుకున్నారు. టీడీపీ ఎన్నారై అమెరికా విభాగానికి చెందిన సభ్యుల సహకారంతో బాలిక ఆపరేషన్ కు అవసరమైన రూ.15 లక్షలను ఆయన సేకరించారు. ఈ నిధులను నారా లోకేశ్ ద్వారా టీడీపీ ఎన్నారై అమెరికా విభాగం బాధిత బాలికకు అందజేసింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో టీడీపీ ఎన్నారై అమెరికా విభాగం ముందుంటుందని లోకేశ్ అభినందించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa