బలమైన దేశం ఏర్పాటుకు తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చిరస్మరణీయమని గూడూరు రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ దశరథ రామారావు అన్నారు. ఒకే జాతి, ఒకే దేశం ఉండాలన్న ఆకాంక్షకు అనుగుణంగా ఆయన విశేష కృషి చేసినట్లు చెప్పారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు నడవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించామన్నారు. అనంతరం గూడూరు పట్టణ, రూరల్ పోలీస్ సిబ్బంది పాత బస్టాండ్ నుండి సంఘం థియేటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ హజరత్ బాబు, రూరల్ సీఐ దశరథ రామారావు, రూరల్ ఎస్ఐ బ్రహ్మ నాయుడు, వన్ టౌన్ ఎస్ఐ పవన్, సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa