మంత్రి ఆర్. కె. రోజా నిర్దేశకత్వంలో నవంబర్ నాలుగో తేదీన శుక్రవారం ఉదయం 8. 30 గం!! కు పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం, సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ మరియు ఏ. పి. ఎస్. ఎస్. డి. సి ఆధ్వర్యంలోనియోజకవర్గ స్థాయి జాబ్ మేళా నిర్ణయించారు. జాబ్ మేళాలో పాల్గొనడానికి నిరుద్యోగులకు సమాచారాన్ని అందచేయవలసినదిగా కోరడమైనది.
ఈ సమావేశంలో నగరి, పుత్తూరు మునిసిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, నగరి, పుత్తూరు, నిండ్ర, వడమాలపేట, విజయపురం మండలం ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కో ఆప్సన్ సభ్యులు, రాష్ట్ర డైరెక్టర్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మునిసిపాలిటీ, మండల అధికారులు పాల్గొనవలసిందిగా మనవి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa