రాజా నియోజకవర్గంలోని రేగిడి ఆముదాలవలస మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి యనమల రామకృష్ణుని కలిసారు. వచ్చే ఎన్నికల్లో మాజీ స్పీకరు కావలి ప్రతిభా భారతికి సీటు కేటాయించాలని కోరారు. ఆదివారం జిల్లా పర్యటనకు వచ్చిన పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని రేగిడి ఆముదాలవలస మండల తెదేపా నాయకులు కార్యకర్తలు కలుసుకొని ఈ మేరకు విజ్ఞప్తి చేసారు. రాజాము నియోజకవర్గ సీటును ప్రతిభా భారతికి కేటాయిస్తే భారీ విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేసారు. తెలుగుదేశం పార్టీ పటిష్టతకు, ప్రతిభా భారతి గెలుపుకు తామంతా అహర్నిశలు కృషి చేస్తామని ఈ సందర్భంగా యనమలకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు దృష్టికి తీసుకొని వెళతానని యనమల రామకృష్ణుడు భరోసా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa