ప్రధాని విశాఖ సభకు జనసేనను దూరం పెట్టారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. నిన్నామొన్నటి వరకూ జనసేన మా మిత్రపక్షమని చెప్పకున్న కమలనాథులు. ప్రస్తుతం పవన్ మాట ఎత్తడం లేదు. విశాఖలో ఈనెల 11, 12 తేదీల్లో ప్రధాని పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సభకు పవన్ కల్యాణ్ కూడా వస్తారని ప్రచారం జరిగింది. బీజేపీ. జనసేన మధ్య స్నేహబంధం కూడా ఉండడంతో విశాఖలో పట్టున్న జనసేన ప్రధాని సభకు జనసమీకరణలో భాగస్వామ్యం అవుతుందని అంతా ఊహించారు. కానీ ప్రస్తుత్తం జనసేన ఊసే లేకుండా జనసమీకరణను బీజీపే ఒంటరిగానే చేస్తోంది. ఇప్పటి వరకు జనసేన అధ్యక్షుడు పవన్. విశాఖలో నిర్వహించనున్న ప్రధాని సభకు వస్తారా? రారా? అన్నది స్పష్టత లేదు. మరోవైపు ప్రధాని విశాఖ పర్యటనను వైసీపీ తన భుజాలపై వేసుకుంది. అధికారపార్టీ కావడంతో ప్రధాని సభకు భారీగా జనసమీకరణ చేయడంలో సఫలీకృతం కావడం ఖాయం. అంతేకాకుండా విశాఖలో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయసాయిరెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం కావడం చరిత్ర చెబుతున్న సత్యం.
విశాఖలో ప్రధాని మోడీ నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత పర్యటన చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన దాదాపుగా పదివేల కోట్ల రూపాయల విలువ చేసే అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. మోడీ టూర్ ని పొలిటికల్ గా హైలెట్ చేసి తన మైలేజ్ పెంచుకోవాలని బీజేపీ చూస్తోంది. బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఎంపీ జీవీఎల్ నరసింహారావు సహా కీలక నేతలు విశాఖలో ఇపుడు మకాం పెట్టారు.
మోడీకి ఘనస్వాగతం పలకడంతో పాటు భారీ ఎత్తున విశాఖ వీధులలో రోడ్డు షో చేయాలని డిసైడ్ అయ్యారు. మోడీ సభకు లక్ష మందికి తక్కువ కాకుండా జనాలను సమీకరించాలని నిర్ణయించారు. విశాఖలో మోడీ వచ్చే మార్గంలో సోము వీర్రాజు, జీవీఎల్ కొందరు నాయకులు ఫీల్డ్ సర్వే కూడా చేశారు. ఇదంతా సరేనని అనుకున్నా బీజేపీకి అంత బలం ఎక్కడ ఉంది. లక్షలాది మందితో సభను నిర్వహించాలని ఆ పార్టీ ప్రకటించినా మాటలా అంటే జవాబు లేదు.
అయితే వైసీపీ ప్రధాని సభను సవాల్ గా తీసుకుని జనసమీకరణ చేస్తోంది కాబట్టి సభలో లక్షలాది జనం రావడం ఖాయం. అందులో బీజేపీ వాటా ఎంత ఉందో వారే చెప్పాల్సి ఉంటుంది. మోడీ విశాఖ టూర్ లో మిత్రపక్షం జనసేనను పిలుస్తున్నారా అన్న దాని మీద క్లారిటీ లేదు.
బీజేపీ సొంతంగానే జనసమీకరణ చేయాలనుకోవడం చూస్తే సేనను సైడ్ చేసినట్లుగానే ఉంది అంటున్నారు. దీంతో ప్రధాని అధికారిక సభ పూర్తిగా వైసీపీ బీజేపీలతోనే సాగుతుందని తెలుస్తోంది. వైసీపీ మోడీ టూర్ ని హైలెట్ చేస్తోందని బీజేపీ నేతలు ఒక వైపు అంటున్నా ప్రధాని సభలో జనాలు కళకళలాడాలంటే అధికార వైసీపీ తోడు ఉండి తీరాల్సిందే అన్నది అసలు సత్యం. అయినా భేషజంగా పైకి మా ప్రధాని మా బీజేపీ మనిషి అని బీజేపీ నేతలు హడావుడి చేస్తున్నారు అని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa