ప్రజా సమస్యల పరిష్కరించేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం జరిగిందని శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వింజమూరు మండలం శంఖవరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం భాగంగా ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలు పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో స్వరూప రాణి, మండల వైసీపీ కన్వీనర్ రేవనూరు శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైసిపి నాయకులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa