ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీస్ ల అదుపులో అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 10, 2022, 04:26 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు లో ఈడీ దూసుకెళుతోంది. ఇప్పటి వరకూ డిల్లీ లిక్కర్ స్కాంలో టీడీపీ నేతల  ప్రమేయం ఉందంటూ దుమ్మెత్తి పోసిన వైసీపీ నేతల కు నేడు ఈడీ ఊహించని ఝలక్ ఇచ్చింది. నేడు ఈ కేసులో ఇద్దరు కీలక వ్యాపారులు అరెస్ట్‌ చేసింది. వారిలో ఒకరు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  దగ్గర బంధువు కావడం గమనార్హం. అంటే విజయసాయిరెడ్డి అల్లుడికి స్వయానా అన్న అయిన పెన్నాక శరత్ చంద్రారెడ్డిని ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్ట్ చేసింది. అలాగే తెలంగాణ కు చెందిన వినయ్‌బాబును కూడా అరెస్ట్ చేసింది. కాగా.. శరత్‌ చంద్రారెడ్డి, వినయ్‌బాబులకు.. కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం ఉందని ఈడీ వెల్లడించింది. ప్రస్తుతం శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ గా ఉన్నారు. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో అరబిందో గ్రూపునకు డైరెక్టర్‌గా ఉన్న శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. అరబిందో గ్రూపులోని 12కంపెనీలకు శరత్ చంద్రారెడ్డి డైరెక్టరుగా ఉన్నారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా ఆయన ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌‌ లో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి ఈఎండీ లు చెల్లించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa